Kadiri Lakshmi Narasimha Swamy Temple 2023

YouTube Subscribe
Please share it
5/5 - (3 votes)

Kadiri Lakshmi Narasimha Swamy Temple

Online booking Procedure : eHundi | Paroksha Seva | eDonation

This section provides important information on the timings of the temple.

Morning: 5.30 AM to 1.00 PM

Evening: 4.30 PM to 8.45 PM

Kadiri Lakshmi Narasimha Swamy Temple is a Hindu temple in Kadiri, Andhra Pradesh, India. It is dedicated to the Hindu god Vishnu and his avatar Narasimha. The temple was built around the 12th century and was patronized by the Vijayanagara Empire. The temple has a Swayambhu lingam (self-manifested) from its roots and hence it is also called as Swayambhu from roots. It is one of the three temples in India with this feature. The other two are at Varanasi in Uttar Pradesh state and at Tiruchirapalli in Tamil Nadu state.

The word Swayambhu means self-manifested and refers to a representation of god that has appeared without human intervention. It also refers to a natural object that is worshipped as a god or divine incarnation in Indian religions such as Hinduism. The term comes from Sanskrit “svayam” (स्वयं) meaning “self”

Pilgrimage to Swayambhu from roots temple is considered one of the holiest pilgrimages for Hindus. This pilgrimage takes place during Chaitra month which falls in March or April every year. It attracts thousands of pilgrims every year and many devotees believe that it cleanses their sins and makes them pure again.

Kadiri Lakshmi Narasimha Swamy Temple

మన రాష్ట్రంలో ఉన్న నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కదిరి. అనంతపురం పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఈ క్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. పురాణ మరియు చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశేషాలను తెలుసుకుందాం.
కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. శ్రీ నరసింహస్వామి కృతయుగమునా అర్జన వృక్షమును వెలిశాడు. పదవ శతాబ్దంలో పట్నం పాలే గారు, రంగనాయకుల గారి భూములు, కదిరి వృక్షం క్రింద ఉన్న శాలగ్రామాలకు తమ పాలతో, అభిషేకించేవట. దాని ఫలితంగా రంగనాయకులకు, సకల ఐశ్వర్యాలు సిద్ధించయట. అనంతరం ఒక రోజున, నరసింహ స్వామి వారు పాలే గారికి స్వప్నంలో కనిపించి, గర్భగుడి గృహనిర్మాణం చెయ్యమని ఆదేశించాడు. దానితో అతడు భక్తిశ్రద్ధలతో, స్వామి వారికి ఆలయనిర్మాణం చేసినట్లు, చారిత్రాక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం శాలివాహన శకం 1247 సంవత్సరములో బుక్క రాయల వారు ఆలయం మండపం నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. కదిరి కి చేరుకున్న భక్తులు, ముందుగా స్వామివారికి తమ తలనీలాలు సమర్పించుకుని, సుచితో ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు.
కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉండటం వెనక, పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రసన్నుడై, తాను ఇక్కడ ఉన్న భృగు తీర్థం కింద వేంచేసియున్న అని తన ప్రతిబింబాలను ఆరాధించి, లోకములకు వెల్లడించమని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత భృగుమహర్షి వసంతరుతువు నందు ఆ విగ్రహాలను వెలికి తీసి ప్రాణప్రతిష్ఠ చేసి, వసంత వల్లభుడు అనే పేరు పెట్టాడట.
అలాగే ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక, మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుడిని చంపిన స్వామివారి రౌద్ర రూపాన్ని తగ్గించమని, ఇంద్రాది దేవతలు ప్రహ్లాదుడు కోరగా, స్వామివారు శాంతించి, ఈ క్షేత్రంలో ప్రహ్లాద వరద సమేతంగా, వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
1822 వ సంవత్సరము నుంచి, ధర్మకర్తల నియామకంలో, కదిరి దేవాలయం నిర్మాణాలలో, పునరుద్ధరణ చర్యలు చేపట్టడం 1953 వ సంవత్సరం లో దుర్గ ఆలయాన్ని అమృతవల్లి ఆలయం గా మార్పు చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యమంగళ శిలా రూపాన్ని దర్శించుకున్న భక్తులు, ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అమృత వల్లి అమ్మవారిని, ఆండాళ్ అమ్మవారిని దర్శించుకుంటారు.
కదిరి క్షేత్రం గురించి బ్రహ్మాండపురాణంలో, ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అమృతవల్లి అమ్మవారిని ఆండాళ్ అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులు, ఇక్కడ సమీపంలోని మూడు కిలోమీటర్ లోగల కదిరి కొండకు చేరుకుంటారు. దీనిని ఒకప్పుడు స్తోత్రాద్రి అని పిలిచేవాళ్ళు. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలోనే హిరణ్యకశిపుని సంహరించన నరసింహ స్వామి వారు ఉగ్రరూపాన్ని విడిచిపెట్టారని చెప్తారు.ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి.

ఈ స్వామి వారికి విగ్రహారాధన ప్రతిరోజు ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి చెమట పడుతుంది. ఇది స్వామి వారి మహత్యం. అర్థం స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తున్న ఉండగా, ప్రహ్లాదుడు అత్యంత భక్తి శ్రద్ధలతో చేతులు కట్టుకుని స్వామివారి వెనక నిలబడి ఉంటాడు. గర్భగృహం మరియు ముఖ మండపం త్రెత్రా యుగం యొక్క పురాతన నిర్మాణ కళకు ఉదాహరణగా నిలుస్తాయి.ఈ ఆలయానికి నాలుగు ప్రవేశాలు ఉన్నాయి.వీటిలో తూర్పు ద్వారం హర హర ఛీ నిర్మించిన ప్రధాన ద్వారం తూర్పు కనుమల ప్రవేశ ద్వారం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనపడుతుంది. తామర పువ్వు ఆకారపు వేదికలో నరసింహస్వామి చిత్రీకరించారు ఇందులో దాని వెనుక ప్రహ్లాదుడు మరియు ఆంజనేయ విగ్రహాలు ప్రధాన ముఖద్వారం దగ్గర ఉన్నాయి.

లక్ష్మీ నరసింహ స్వామి వారి రథోత్సవం కన్నులారా దర్శించండి : –

Temples near Kadhri Narasimha Temple are Sri Yogivemana Temple 8 Kms,Thimmammamarrimanu : 25 kms, Palapati Anjaneya Swamy Temple 10 km.

                                                               
Also read : సర్ప సూక్తం

Please share it

1 thought on “Kadiri Lakshmi Narasimha Swamy Temple 2023”

Leave a Comment